Skip to main content

నడవలేడు.. నడిపిస్తున్నాడు...




డాన్ బాస్కో రిహాబిలిటేషన్ సెంటర్, రామంతాపూర్, హైదరాబాద్
వికలాంగుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. 
ఒక వికలాంగుడు కన్నీరు పెడుతూ పాట పాడుతున్నాడు..
వింటున్న వారిలోంచి ఒకాయన లేచి.. ‘‘ఆపండి.. ఏడిపించే ఇలాంటి పాటలొద్దు. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం. ఇక చాలు. వికలాంగుల్లో ధైర్యం పెంచే పాటలు పాడండి. ఆశ నింపే మాటలు చెప్పండి. జై వికలాంగ్’’ అని కష్టంగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్. వికలాంగులకు నాయకుడు. 


నెల రోజుల తర్వాత.. ఎన్‌పిడిఓ కార్యాలయం,
మలక్‌పేట
ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్‌ని కలిసేందుకు వచ్చారు. తాము తీయబోతున్న డాక్యుమెంటరీ కోసం ఒక వికలాంగ బాలుడు కావాలని అడిగారు. కథేంటని అడిగారు శ్రీనివాస్. వచ్చిన వారు క్లుప్తంగా చెప్పారు. ‘‘బావుంది. నథింగ్ ఎబౌట్ అజ్ వితౌట్ అజ్.. మేం లేనిదే మా గురించి వద్దు.. మమ్మిల్ని పనికిరాని వాళ్లుగా కాదు.. మేమూ సాధించగలమని చూపించండి’’ అన్నారు శ్రీనివాస్.
ఈ రెండు సంఘటనలు చాలాఉ ఆయనేంటో చెప్పడానికి, ఏనుగమ్మ ఏనుగు అని భుజాల మీద ఆడించిన తండ్రి తన కొడుకు నడవలేడని తెలిసి ఆ రోజు బాధపడి ఉంటారు. కానీ ఈ రోజు ‘‘నా కొడుకు వికలాంగుడు అయితేనేం..’’ అని గర్వంగా చెబుతున్నాడు.

ఇంటిల్లిపాదీ బాధితులే...
విషం తాగి శివుడు గరళకంఠుడు మాత్రమే అయ్యాడు. కానీ విషంలాంటి ఫ్లోరైడ్ నీళ్లకు నల్గొండలో చాలామంది వికలాంగులయ్యారు. అలాంటి వారిలో శ్రీనివాస్ ఒకరు. ఆయన తల్లి చక్రమ్మ కూడా ఫ్లోరోసిస్ బాధితురాలే. ముగ్గురు తమ్ముళ్లలో ఇద్దరు. ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు కూడా అలాంటి వారే. అందరిలో పెద్దవాడు శ్రీనివాస్. వైకల్యంలో కూడా. నాన్న పెంటోజి రావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాని ఆర్థిక స్వాతంత్య్రం మాత్రం సాధించలేకపోయాడు. పేదరికంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో భార్యాపిల్లల వైకల్యం చూసి కృంగిపోయాడు. చదివిస్తేనన్నా వారి ‘కాళ్ల’ మీద వారే నిలబడతారనుకున్నాడు. పిల్లలందర్నీ సర్కారు బళ్లో వేశాడు. అసలు నడవలేని శ్రీనివాస్‌ని మాత్రం దగ్గరలోని చిన్న ప్రైవేటు బళ్లో చేర్పించాడు. రోజూ భుజానెత్తుకుని బల్లో వదిలి, సాయంత్రం తీసుకొచ్చేవాడు. తను ఆలస్యంగా వెళ్లినరోజు ఒంటరిగా కూర్చుని ఏడ్చే శ్రీనివాస్‌ని చూసి తల్లడిల్లిపోయేవాడు. అతనికి నడక నేర్పాలని నడుం కట్టాడు. వానకు రాళ్లు తేలిన మట్టిగోడ మీద రోజూ నడిపించేవాడు. రకరకాల వ్యాయామాలు చేయించేవాడు. శ్రీనివాస్‌లో చలనం మొదలైంది. హైస్కూల్ చదువుకోసం శ్రీనివాస్‌ని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో నేర్పించారు తల్లిదండ్రులు. అది ఇంటికి చాలా దూరం. తోడు ఉంటేనేగానీ అంత దూరం నడవలేని శ్రీనివాస్ తమ్ముళ్లు, స్నేహితుల సహాయంతో పదో తరగతతి వరకు చదివాడు.

ఇల్లొదిలి హాస్టల్‌కు...
తుపాను వచ్చేముందు వాతావరణం ఒక్క క్షణం ప్రశాంతంగా మారిపోతుంది. జీవితం గొప్ప మలుపు తిరిగే ముందు కూడా కాలం ఒక్క నిమిషం అలా ఆగిపోతుందేమో, శ్రీనివాస్ అలాంటి పరిస్థితుల్లో పడ్డాడు. పదో తరగతి అయిపోయాక ఇంటర్ చదవాలనుకున్నాడు. కానీ పేదరికం గుర్తొచ్చి ఆగిపోయాడు. హైదరాబాద్‌లో ఎలా ఉంటాడు? పంపాలా.. వద్దా?’’ ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. ‘ఇంకెన్నాళ్లు మా చేయి పట్టుకుని తిరుగుతాడు. వాడి కాళ్ల మీద వాడ్ని నడవనీ..’’ వాళ్లో నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ మలక్‌పేటలోని వికలాంగుల హాస్టల్‌లో చేరాడు. ఆ రోజు అతనికి తెలియదు. ఆ హాస్టల్ తన జీవితాన్ని మార్చబోతోందని. తాను అనుభవించిన పేదరికం కన్నా దరిద్రంగా కనిపించింది హాస్టల్. అక్కడ సరైన వసతులు ండేవి కావు. మంచి ఆహారం పెట్టేవాళ్లు కాదు. సబ్బులు, సరుకులు సరిగ్గా ఇచ్చేవారు కాదు. పుస్తకాలు సగం చదువులయ్యాక వచ్చేవి. ఇవన్నీ చూశాక శ్రీనివాస్లో ఆలోచన మొదలైంది. మేమంటే ఎందుకింత నిర్లక్ష్యం అందరికీ అని.

ఎత్తుపల్లాలు...
శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి బాగా కలుపుగోలు మనిషి. చలాకీగా ఉండేవాడు. సీనియర్లను, జూనియర్లను పోగేసి వార్డెన్‌తో గొడవకు దిగేవాడు. ఇతర మాస్టళ్లకు వెళ్లి కాలేజి విద్యార్థులను కూడగట్టేవాడు. అందరూ కలిసి కళాశాల విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ కావాలని ధర్నాలు చేశారు. ఇంటర్ రెండో సంవత్సరంలో వారి కోరిక నెరవేరింది. సలీమ్‌నగర్‌లో వారికోసం ప్రత్యేక హాస్టల్ ప్రారంభమైంది. శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ, టైప్ నేర్చుకుంటూ, వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ బిజీ అయిపోయాడు. అతనికి ఎల్‌ఎల్‌బి చదవాలని ఉంది. కానీ పరిస్థితులు అతన్ని జర్నలిజం వైపు నడిపించాయి. ‘ఉదయం’ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా చేరాడు. 1992లో ఉదయం పత్రిక మూతబడింది. తోటి విలేకరులంతా ఇతర పత్రికల్లో చేరిపోయారు. శ్రీనివాస్‌కు మాత్రం ఇంకో పత్రికలో చేరాలని లేదు. వికలాంగుల కోసం పనిచేయాలనుకునానడు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో యూత్ కాంగ్రెస్‌లో వికలాంగుల కాంగ్రెస్ సమాఖ్య పేరుతో ఒక విభాగాన్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వికలాంగుల ఫోరమ్‌ని స్థాపించాడు. వికలాంగుల ఇళ్ల పట్టాల కోసం పోరాడాడు. 1994లో సెక్రటేరియట్ ముందు నిరాహారదీక్ష కూడా చేశాడు. పట్టాలిచ్చేందుకు ప్రబుత్వం ఒప్పుకుంది కానీ అసలైన లబ్దిదారులకు అందకుండా స్వార్థపరుల చేతులకు చిక్కాయి ఆ పట్టాలు. ఆ రాజకీయాలు అతనికి నచ్చలేదు.

పత్రిక నడిపాడు...
అతని జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునానడు. 1995లో వికలాంగుల చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని గురించి గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకునానడు. చిన్నప్పట్నించి పరిచయం ఉన్న స్నేహితులందరినీ కలిశాడు. డబ్బు పోగేశాడు. 96లో ‘వికలాంగుల వార్తాతేజ’ పేరుతో మాస పత్రికని ప్రారంభించాడు. కష్టంగా రెండేళ్లు నడిపించాడు. డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంకునుంచి లోన్ తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు. అదీ నడవలేదు. యాక్షన్ ఎయిడ్‌తో కలిసి కొంతకాలం పనిచేశాడు. వారి నుంచి ఒక పనిని ప్రొఫెషనల్‌గా ఎలా చేయాలో నేర్చుకున్నాడు. వికలాంగుల కోసం తాను నడుపుతున్న పత్రికకు సహకరించాలని యాక్షన్ ఎయిడ్‌ని కోరాడు. అతని ఆలోచనలు నచ్చి 1996లో లక్షా 98 వేల రూపాయలిచ్చింది ఆ సంస్థ. ఆ సొమ్ముతో వికలాంగుల చట్టాలు, హక్కులు, ప్రభుత్వ పథకాలు, స్వయంగా ఉపాధి పథకాలు, న్యాయసలహాలు తదితర అంశాలను పొందు పరుస్తూ ఒక మ్యాగజైన్‌ని రూపొందించి లక్షమందికి పంచిపెట్టాడు. అతని కల నెరవేరింది. గ్రామీణ స్థాయిలో వికలాంగులకు కూడా ఆ పత్రిక చేరింది. ఆ సంవత్సరం శ్రీనివాస్‌కు వికలాంగుల స్వయం ఉపాధిలో బెస్ట్ ఎంప్లాయ్‌గా జాతీయ అవార్డు లభించింది.

జాతీయ సంస్థలతో కలిసి...
యాక్షన్ ఎయిడ్‌లో ఉండగానే శ్రీనివాస జాతీయ వికలాంగుల సంస్థలతో కూడా కలిసి పనిచేశాడు. తమ జాతీయ నాయుకుడు జావేద్ లాంటి వారి సహకారంతో తాను రూఒపొందించిన పత్రికను అన్ని భాసల్లోనూ ముద్రించాడు. అది 2001 జనాభా లెక్కల్లో వికలాంగుల సక్రమ గుర్తింపుకు ఉపయోగపడింది. ఆరు జిల్లాల్లో వికలాంగుల స్వాధికార ప్రాజెక్టును రూపొందించి 2002లో ప్రభుత్వం నుంచి 110 కోట్ల రూపాయల సహాయాన్ని పొందాడు. ఆ ప్రాజెక్టు చేస్తునప్పుడు పరిచయమైన భాగ్యశ్రీ(వికలాంగురాలు)ని 2003లో ఆసియా సోషల్ ఫోరమ్ వేదికపై పెళ్లి చేసకున్నాడు. ఇప్పుడు అతనికి ఒక అబ్బాయి. అతను కూడా వికలాంగుడే.

నెట్‌వర్క్
పత్రిక నడిపిస్తూనే 2003లో వికలాంగుల కోసం ఒక నెట్‌వర్క్‌ని ప్రారంభించాడు శ్రీనివాస్. అన్ని జిల్లాలు తిరుగుతూ వికలాంగుల సంఘాలను ఏకం చేస్తూ ఎన్‌పిడిఓ (నెట్‌వర్క్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ ఆర్గనైజేషన్)ని ఏర్పాటు చేశాడు. ఒక రూపాయి సభ్యత్వంతో 75 వేల మందిని సభ్యులుగా చేర్చాడు. 3 వేల మందికి శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో వికలాంగులకు స్వయం ఉపాధి, పెన్షన్లు, హక్కులు, చట్టాల గురించి అవగాహన కలిగిస్తున్నాడు. వికలాంగులకు రాజకీయ గుర్తింపు రావాలని 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిపై ఒక అంధుణ్ణి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఒక వికలాంగురాలిన పోటీ చేయించాడు. ప్రస్తుతం ఎన్‌పిడిఓ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 52 మందికి, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందుకే 2010 డిసెంబర్ 3న వికలాంగులకు ఉపాధి కల్పించిన బెస్ట్ ఎంప్లాయర్‌గా మరోసారి జాతీయ అవార్డు తీసుకున్నారు శ్రీనివాస్. ప్రస్తుతం 100 పాఠశాలలను అధ్యయనం చేసి వికలాంగ బాలలకు 1995 చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కోరుతూ హైకోర్టులో రిట్ వేశాడు. ఆయన వైకల్యం ఆయన్ని ఒకనాడు ఎంత కృంగదీసిందో గాని ఇవ్వాళ మాత్రం చాలామందికి సహాయపడుతోంది.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...