Skip to main content

Posts

Showing posts from April, 2011

ఇంకో ఇరయై ఏళ్ల తర్వాత నేను ఇలా ఉంటానట

 

ఒక జూనియర్ ఆర్టిస్ట్ వేసిన నా బొమ్మ

ఇది అవినీతి రాజా అద్దాల మేడ కాదు

స్పెక్ట్రమ్ రాజా.. అద్దాల మేడ పేరుతో ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా సర్కులేట్ అవుతున్న ఈ మెయిల్‌ని గమనించారా? అవినీతి సొమ్ముతో ఎంత అద్భుతంగా కట్టించుకున్నాడని చూసినవారందరూ ఆశ్చర్యపోయారు. గానీ నిజానికిది రాజా ఇల్లు కాదు. ఎవరో దీన్ని తప్పుగా ప్రచారం చేశారు. ఈ మధ్య ఇలాంటి ఈ మెయిల్‌లు సర్వసాధారణమైపోయాయి. ఆ సంగతి వదిలేస్తే అసలు ఈ ఇల్లు ఎవరిది? దీనికి కచ్చితమైన ఆధారాలున్నాయి. పోల్స్ బొటిక్ అనే వెబ్‌సైట్‌లో ‘అద్దాల మేడలో నివసిస్తారా?’ అన్న పేరుతో ఈ ఇంటి ఫోటోలున్నాయి. మరి ఈ ఇల్లు ఎవరిది?...అంటే.. అది తెలియదు గానీ.. అమెరికాకు చెందిన స్టీవ్ హెర్మాన్ అనే అర్కిటెక్ట్ దీన్ని నిర్మించాడు. దీని పేరు గ్లాస్ పెవీలియన్. కాలిఫోర్నియాలోని మోంటెసిటోలో ఈ భవనం ఉంది. దానికి సంబంధించిన వివరాలు చూడాలంటే.. ఆయన వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి. అంతెందుకు గూగుల్ సెర్చ్‌లో స్టీవ్ హెర్మాన్ అనిగానీ, గ్లాస్ పవీలియన అని గానీ కొట్టి చూడండి. మీకు కావాల్సినన్ని బొమ్మలు, సమాచారం దొరుకుతాయి. నిజం నిప్పులాంటిది.

భయానక విధి (DREADFUL FATE)కి అవార్డుల పంట

పేస్ బుక్ లో సత్య రాసిన ఈ పోస్ట్ చూసి.. నాకు చాలా ఆనందం వేసింది. WoW.. Great to know that my documentary film DREADFUL FATE has selected for 3rd International Health Film Festival 2011, Athens Greece. 1st ever documentary film from Andhra Pradesh to be screened in Greece, Europe. thanks to my crew members and my producer.. గ్రీసు లో జరిగే మూడో ఇంటర్ నేషనల్ హెల్త్ ఫిలిం ఫెస్టివల్ - 2011 కు భయానక విధి (DREADFUL FATE) ఎంపికైంది.  ఆంద్ర ప్రదేశ్ నుంచి ఎంపికైన తొలి చిత్రమిది.  12.7.2010న నేను ఆంధ్రజ్యోతి 'నవ్య'లో ఆర్కుట్ స్నేహం... ఫ్లోరైడ్ చిత్రం శీర్షికన ఆ చిత్రానికి సంబందించిన వ్యాసం రాశాను. నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య నేపద్యం లో తీసిన ఈ డాక్యుమెంటరికి తాజాగా నాశిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరి  అవార్డు వచ్చింది. మల్లి ఇప్పుడు మరో అవార్డు రావడం విశేషం. 

అవినీతి రాజా అద్దాల మేడ

అవినీతి రాజా... అద్దాల మేడ... పేరుతో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈమెయిలు కు సంబందించిన ఫోటోలు ఇవ్వి. ఇవి నిజంగా రాజ ఇంటి ఫోటోలో కాదో నాకు మాత్రం తెలియదు.

వేప, పసుపు కోసం యుద్ధాలు!

దెబ్బ తగిలితే పసుపు రాస్తే అది చట్టరీత్యా నేరమట. కురుపులు, అమ్మవారు () వస్తే వేపాకులు వాడినా కూడా బహుళ జాతి సంస్థలు మనపై నేరాలు మోపి కేసులు పెడతాయట. ఎందుకంటే వాటిని వాడే విజ్ఞానం వారే కనుగొన్నారట. దీనిని వారే పేటెంట్‌ చేసుకున్నారట. ఇదండీ సంగతి! గత దశాబ్దమంతా (1995 - 2005) భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం, మేధావి వర్గం యు.ఎస్‌. పేటెంట్‌ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞాన యుద్ధాలు చే శారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం దాదాపు  భారతదేశమంతటా ఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్టు వారికి నిరూపించడానికి తలప్రాణం తోకకొచ్చింది. వేప, పసుపే కాదు నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేద ఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరకు బాసుమతి బియ్యం కూడా పేటెంట్‌ చేసుకొన్నారు. ఒకప్పుడు వేప, పసుపు మనం వాడుతుంటే మూఢ నమ్మకాలని మనల్ని వెక్కిరించిన పాశ్చాత్యులు వాటిలోని ఔషధీయ విలువలను నేడు తెలుసుకొని వాటిని తామే కనుగొన్నట్లు పేటెంట్‌ తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా మనల్ని వాడకుండా నియంత్రించడం చాలా హాస్యాస్పదంగానూ, దురాగతంగాను ఉన్నది. ఇంతటి రభసలో ఉన్న ఈ వేప, పసుపుల మర్మా...

పాపం గోమాత!

హైదరాబాద్‌లో రోడ్ల పక్కన పెద్ద పొట్టతో నడవలేక నడవలేక నడుస్తున్న ఆవులను మీరెప్పుడైనా చూశారా? ‘ఇది రోడ్ల మీద దొరికిందల్లా తిని ఎలా బలిసిందో చూడరా!’ అని ఒకసారి ఒక ఆవుని చూపిస్తూ అన్నాడొక ఫ్రెండ్. అప్పుడు నాకు చెప్పాలనిపించింది కానీ చెప్పలేదు. ఇప్పుడు ఈ ఆవు గురించి చదివాక వాడే అర్థం చేసుకుంటాడు. ఖమ్మం జిల్లా టాబ్లాయిడ్ పేజీలో ఇంటర్‌నెట్‌లో తిరగేస్తుంటే ఒక చిన్న వార్త కనిపించింది. నున్నా మాధవరావు అనే ఆయన ఆవు నాలుగు రోజులుగా మేత మేయడం లేదు. తీవ్ర అస్వస్థతకు గురైంది. రోజు రోజుకూ కడుపు పరిమాణం పెరుగుతోంది. ఆవు అప్పుడప్పుడూ గిలగిలా కొట్టుకుంటుండేది. దీంతో ఆయన ఒక పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ సకాలానికి ఆపరేషన్ చేయడంతో ఆ ఆవు బతికింది. కాకపోతే దాని కడుపులోంచి బయటపడ్డ ప్లాస్టిక్ కవర్లను చూశాక మాధవరావు గుండె పగిలిపోయింది. ఆయనకే కాదు.. ఇది చదివిన ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. ప్లాస్టిక్ వినియోగంలో ప్రజల అవగాహనాలోపం.. నిషేధం అమలులో అధికారుల బాధ్యతా రాహిత్యానికి పర్యావరణమే కాదు.. మూగ జీవాలు కూడా బలవుతున్నాయి.

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లండన్ నుంచి ఢిల్లీకి రోడ్డు ప్రయాణం చేసిన దంపతులు

పెంపుడు జంతువుల సంరక్షణ కోసం నిధులు సేకరించేందుకు ఒక జంట లండన్ నుంచి ఢిల్లీ వరకు రోడ్డు ప్రయాణం చేశారు. 15 దేశాల మీదుగా ఎంతో కష్టమైన ఈ పనిని 51 రోజుల్లో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. ఆ దంపతులే ఢిల్లీకి చెందిన పూజా, తుషార్. ప్రస్తుతం వీరు లండన్లో నివసిస్తున్నారు. వీరు సాహసయాత్ర పూర్తయిన తర్వాత నేను ఆంధ్రజ్యోతి నవ్యలో 12.8.2010లో వారి ఈమెయిల్ ఇంటర్వ్యూ రాశాను. (ఆ వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ఫోటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ) తాజాగా వారికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చినట్లు ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఆ రికార్డు ఇక్కడ .

బయటి ప్రపంచానికి 14 కి. మీ. దూరంలో..

నాగార్జున సాగర్ దారి బోటు లో ప్రయాణం  నాగార్జున కొండ పది కిలోమీటర్ల దూరం నుంచి నాగార్జున కొండ కాస్త దగ్గరగా కొండ దగ్గరికి వెళ్తున్న బోటు బోటులో తోటి ప్రయాణికులు కొండ దగ్గరికి వచేశం నీళ్ళ మద్యలో..  కొండ మీద మ్యుజియం గార్డెన్ కొండ మీద పురాతన స్నానాల వాటిక లాంగ్ షాట్ కాంటీన్లో లంచ్ స్టేషన్  స్టేషన్ ముందు హెచ్చరిక ఇంక్కడి నుంచే కొండ మీదికి ప్రయాణం  14 కి. మీ. ఈ చౌరస్తా నుంచి కుడివైపు వెళ్తేనే లంచ్ స్టేషన్ వస్తుంది కొత్త బ్రిడ్జి.. లాంగ్ షాట్ సాగర్ డ్యాం ఈత కోసం దిగాం  బ్యాక్ టు పవిల్లియాన్ కొత్త బ్రిడ్జి మీద నుంచి డ్యాం మా తమ్ముడు   రోడ్ సైడ్ బ్రేక్ ఫాస్ట్  నాగార్జున కొండ గురించి :   సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ ( ఆంగ్లం : Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ ప్రదర్శనశాల ( ...

మార్చురీలో చూసిన శవాలు.. అర్థరాత్రి నీతో గడిపిన క్షణాలు ఇప్పుడు కళ్ల ముందు కదులుతున్నాయి నేస్తమా...

‘సీనియర్ పాత్రికేయులు బాలస్వామి మృతి’... ఈ వార్త పేపర్లో చూడగానే నాకు పెద్దగా బాధనిపించలేదు. బాధపడడానికి ఆయన నాకేం పరిచయం లేని వ్యక్తి కాదు. బాగా పరిచయం. నాలుగేళ్ల అనుబంధం. ఏడాది కలిసి పనిచేసిన అనుభవం. అయినా నాకెందుకు బాధ అనిపించడం లేదు? పసిపాప నవ్వుని చూసి.. ప్రవహించే సెలయేటిని చూసి పరవశించి పోయే నాకు.. రోడ్డుపై పారే రక్తాన్ని.. మార్చురీలో కోసిన శవాల్ని, బండరాయితో మోదిన తలకాయల్ని, చెరువులో తేలిన చిన్నారుల్ని, ఫ్యానుకు ఉరేసుకున్న అమ్మాయిల్ని చూపించిన వ్యక్తి బాలు. ఎందుకు నేస్తమా నన్నింత కరుడుగట్టిన వాడిలా చేశావు? నీవు లేవని తెలిశాక.. పెద్దగా స్పందించకుండా తయారు చేశావు? నీవు లేకపోయినా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఉస్మానియా మార్చురీలో నీతో కలిసి చూసిన శవాలు.. అర్థరాత్రి రెండు మూడు గంటల వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో గడిపిన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తూ నన్ను కకావికలం చేస్తున్నాయి దోస్త్. --- బాలస్వామికి క్రైమ్ రిపోర్టర్‌గా మంచి పేరుంది. కొంత కాలం ప్రజాశక్తిలో పనిచేశాడు. అప్పుడు నేను ఏ ఇంటరో డిగ్రీనో చదువుతుండి ఉంటాను. బాలస్వామి ఉద్యోగం మానేసి సొంత ఊరికి వెళ్లి ప్రయివేటు స్కూల్ పెట్ట...