Skip to main content

స్టాల్ నెంబర్ 91 మాత్రం ప్రత్యేకమైనది ఎందుకో ?

,డిసెంబర్ 24...మధ్యాహ్నం 12.30.. హైదరాబాద్ బుక్ ఫెయిర్, నెక్లెస్ రోడ్.. గేటుకు ఎదురుగా చాలా పుస్తకాల స్టాల్స్ ఉన్నాయి. ప్రతిదాంట్లో చాలామంది రచయితల పుస్తకాలు.. రకరకాల అంశాల మీద రాసినవి కనిపిస్తాయి. కానీ ఎడమవైపు రెండోది మాత్రం అక్కడ ప్రత్యేకమైనది.
ఎందుకో మీరే చదవండి.
స్టాల్ నెంబర్ 91.. గాంధీ ప్రచురణలు..
సలామ్ హైదరాబాద్, చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర, ఒక హిజ్రా కథ, 1948 సెప్టెంబర్ 17 జ్ఞాపకాలు గాయాలు, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు.. ఇలా చాలా పుస్తకాలు ఆ స్టాల్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ రాసింది ఒక్కరే.. ఆయనే పరవస్తు లోకేశ్వర్. 250కి పైగా స్టాల్స్ ఉన్న ఆ పుస్తక ప్రదర్శనలో ఒక రచయిత ఏర్పాటు చేసిన స్టాల్ మాత్రం అదొక్కటే.
‘వట్టికోట’ వారసత్వం...
తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు తీసి ప్రాణం పోసిన వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తితో ఈ స్టాల్‌ని ఏర్పాటు చేశానని చెప్పారు లోకేశ్వర్. నిజాంను గడగడలాడించిన ‘ఆంవూధమహాసభ’ నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా, గ్రంథాలయోద్యమ సారథిగా వట్టికోట సుపరిచితులు. 1923లో ఆయన గ్రామ గ్రామనికి వెళ్లి పుస్తకాలు అమ్మేవాడు. ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి బాలగోపాల్ కూడా పావలా, ఆఠాణాకు పుస్తకాలను ఫుట్‌పాత్ మీద కూర్చుని అమ్మాడు. అలాంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తితోనే బుక్‌స్టాల్ పెట్టానంటారు లోకేశ్వర్.
రెండు లక్ష్యాలు...
‘‘వట్టికోట వారసత్వాన్ని కొనసాగించాలన్నది నా మొదటి లక్ష్యం. టీవీలు.. సినిమాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో పుస్తకాలు.. వాటి ప్రాధాన్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రచయితలు కూడా పుస్తకాలు అమ్ముకోవడం నామోషిగా భావిస్తున్నారు. ఉచితంగా పంచితే ఎవరూ చదవరు.. కొనడం నేర్పితేనే చదవడం నేర్చుకుంటారు. రెండోది.. సామాన్య పాఠకులతో పరిచయాలు ఏర్పడతాయి. పాఠకులు ఏం కోరుకుంటున్నారో రచయితకు తెలుస్తుంది. అలాంటి అనుభవాలు నాకు ఇక్కడ చాలా ఎదురయ్యాయి’’ అని చెప్పారు లోకేశ్వర్.
ఎన్నో అనుభవాలు..
‘‘రోజూ ఈ స్టాల్‌కు వచ్చే వారిని పరిశీలిస్తున్నాను. వారితో మాట్లాడుతున్నాను. ఈ పుస్తకాల మీద అభివూపాయాలు తీసుకుంటున్నాను. ఒకరోజు.. ఒక సాధారణ వ్యక్తి.. వచ్చి ఈ పుస్తకాల్ని పరిశీలనగా చూశాడు. ఒక్కో పుస్తకాన్ని తెరిచి పేజీలు తిప్పి చదివాడు. అతన్ని చూస్తే చదువుకున్నవాడిలా లేడు. ఈ పుస్తకం చూడండి అని ‘సలామ్ హైదరాబాద్ పుస్తకం ఇచ్చాను. ‘ఇది నేను ఎప్పుడో చదివేశాను’ అన్నాడతను. నాకు ఆశ్చర్యం వేసింది. అతని వివరాలడిగాను. అతనో తాపీమేస్త్రీ. ఇంకొకాయన.. యూనివర్సిటీలో ప్రొఫెసర్.. ‘పుస్తకాలు కాదు.. ఏవైనా పాటల సీడీలు ఉంటే చూపించండి’ అన్నాడు. చూడండి... ఎంత వ్యత్యాసం.. నేను ఇక్కడ కూర్చోబట్టే ఇవి తెలిశాయి. రచయితగా ఆ తాపీమేస్త్రీ అభినందనలు నేనెప్పటికీ మర్చిపోలేను.’’
లక్ష రూపాయలు...
బుక్ ఫెయిర్‌లో పుస్తకాలు ప్రదర్శించాలని నేను అనుకున్నప్పుడు చాలామంది వొద్దని చెప్పారు. రచయితవి నువ్వు ఏర్పాటు చేయడమేంటని కొందరన్నారు. అక్కడ పుస్తకాలు అంతగా అమ్ముడుపోవు.. 20... 30 వేలు నష్టపోతావన్నారు ఇంకొందరు. అయినా ఫర్వాలేదు.. సామాన్య పాఠకుల నాడి తెలుసుకోవాలనుకున్నాను. స్టాల్ ఏర్పాటు చేశాను. నేను నా భార్య శోభ ఇద్దరం కూర్చునేవాళ్లం. ఈ స్టాల్‌లో కూర్చుని.. పాఠశాల విద్యార్థుల్ని కలవగలిగాను.. అనాథ బాలలకు ఉచితంగా కొన్ని పుస్తకాలు ఇచ్చాను. పుస్తకాలు కొనేందుకు పోలీసులొచ్చారు.. డాక్టర్లు.. లాయర్లు.. బిజినెస్‌మేన్‌లు.. సినిమావాళ్లు.. ఇంతమంది వచ్చారు. వారందరినీ కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఈ చిన్న స్టాల్‌లో ఈ రోజు వరకు నేను లక్ష రూపాయల విలువైన పుస్తకాలు అమ్మగలిగానంటే.. మీరు నమ్మలేకపోవచ్చు. కానీ నిజం. ఈ సొమ్మును కూడా మంచి పుస్తకాల ప్రచారం కోసం వాడతాను.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...