Skip to main content

అర్బన్ సైక్లింగ్



మోడల్ : ట్రెక్ ఎలైట్ 9.9 ఎస్‌ఎస్‌ఎల్
బ్రాండ్ : ఫైర్‌ఫాక్స్
బరువు : 10 కేజీలు
స్పెషాలిటీ : సింగిల్ ఫ్రేమ్, 20 స్పీడ్ గేర్స్, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్
మేడ్ విత్ : కార్బన్ ఫైబర్
ధర : 4.25 లక్షలు 

శివ సినిమా గుర్తుందా?
మీరు సైకిల్ తొక్కి ఎన్ని రోజులయింది?
కారు, బంగళా ఉన్నవారెవరైనా సైకిల్ తొక్కడం మీరు చూశారా?
వాకింగ్‌కు వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోతున్నారా?
సరే.. ఇవన్నీ వదిలేయండి..
ఈ కింది కథనం చదవండి.


శివ సినిమా టైమ్‌లో సైకిల్ అంటే కుర్రాళ్లకి క్రేజ్ ఉండేదేమో. కానీ ఈ జనరేషన్‌కి మాత్రం.. వందల సీసీల బైక్ అంటేనే మోజు. సైకిల్ అంటే వారికి పూర్ మేన్ వెహికిల్. నిజమేనా?! సైకిల్ కేవలం పేదవాళ్ల సవారీ మాత్రమేనా? కానే కాదు. ఇండియాలో అత్యంత ఖరీదైన సైకిల్ ధర ఎంతో తెలుసుకుంటే ఈ మాటకు మరింత బలం వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ సైకిల్ ధర రెండు కార్ల వెల కంటే ఎక్కువే. అబ్బ ఛా! నిజామా? అని బ్రేక్ వేయకండి. కచ్చితంగా ఇది నిజం. ఇంతలా కన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఇన్ఫర్మేషన్ ఉందనేగా. అలాంటప్పుడు సైకిల్ ఇంకా రూరల్ పీపుల్‌దే అంటే ఎలా? అర్బన్‌లో సైక్లింగ్ ఇప్పుడొక ఫ్యాషన్.

ఒక ట్రెండ్.‘ఫైర్’ బ్రాండ్
పోయిన సంవత్సరం ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫైర్‌ఫాక్స్ అనే సైకిళ్ల తయారీ కంపెనీ ఒక ఖరీదైన సైకిల్‌ని విడుదల చేసింది. ట్రెక్ ఈక్వినాక్స్ అనే ఆ సైకిల్ ధర అక్షరాల 2.45 లక్షల రూపాయలు. అప్పట్లో ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన సైకిల్. అదే కంపెనీ ఈ సంవత్సరం జరిగిన ఎక్స్‌పోలో ట్రెక్ ఎలైట్ 9.9 ఎస్‌ఎస్‌ఎల్ అనే బైస్కిల్‌ని డిస్‌ప్లేలో పెట్టింది. ఇప్పుడిదే ఇండియాలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బైస్కిల్. దీని ధర ఎంతో తెలుసా? 4.25 లక్షల రూపాయలు. అంటే రెండు నానో కార్ల కంటే ఎక్కువన్నమా అంత డబ్బు పెట్టినా ఇది అషామాషీగా దొరకదు మరి. ‘ఆర్డర్లపై సప్లయి చేయబడును’ టైప్ అన్నమాట.

‘హీరో’ సైకిల్
mancycle talangana patrika telangana culture telangana politics telangana cinemaహీరో సైకిల్ గురించి మీకు చెప్పడమంటే పిల్లలకు చాక్లెట్ గురించి... అమ్మాయిలకు హెయిర్ బ్యాండ్ గురించి చెప్పడం లాంటిదే. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా హీరో సైకిల్ కనిపిస్తోంది. తక్కువ ధరలో హీరో సైకిళ్లు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. కానీ ‘హీరో’ కూడా ఇప్పుడు ప్రీమియం సైకిళ్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో రెడ్‌డాట్ పేరుతో హీరో సైకిల్‌ని విడుదల చేసింది. దీని ధర 43 వేల రూపాయలు. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన దీని బరువు 12.9 కేజీలు. ఎఫ్1 రేస్ కార్లను, విమానాలను ఈ ఫైబర్‌తోనే తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు. పటిష్టంగా ఉంటుంది. అయినప్పటికీ తేలికగానే ఉంటుంది.

వై దిస్ లగ్జరీ?
అర్బన్ ట్రయల్ పేరుతో కంపెనీలు లగ్జరీ సైకిళ్లను రూపొందిస్తున్నాయంటే కారణం ఏంటి? నగరాల్లో కూడా సైకిళ్లు ఎక్కువగానే కొంటున్నారనేగా?! కొంటున్నారు సరే. ఎందుకనేదాని మీదే ఇక్కడ ఆసక్తి ఎక్కువ. అర్బన్‌లో సైక్లింగ్ పెరగడానికి కారణాలు.. ఒకటి హెల్త్ కాన్సియస్. రెండు పర్యావరణ పరిరక్షణ.. ఎనర్జీ సేవింగ్.. ఇంకా చాలా ఉన్నాయి.

లాభాలు
- ప్రతి రోజూ గంటకు 12 నుంచి 13 మీటర్ల దూరం సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో 544 కేలరీలు కరుగుతాయి. స్పీడ్ 16 మీటర్లకు పెంచితే ఈ శక్తి 00లకు చేరుతుంది.
- సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. రక్తవూపసరణ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధులను 50 నుంచి 60 శాతం వరకు దూరం కావొచ్చు.
- కొంచెం పనిచేసినా అలిసిపోయే వారికి సైక్లింగ్ మంచి వ్యాయామం. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల సహనశక్తి, శరీర దృఢత్వం పెరుగుతుంది.
- సైక్లింగ్ వల్ల మీ కండరాలు బలపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 
నేను ఒకటిన్నర సంవత్సరాలుగా సైక్లింగ్ అలవాటు చేసుకున్నాను. బైస్కిల్ తొక్కడం మంచి ఫిజికల్ ఎక్సర్‌సైజ్. రోజూ గంటసేపు సైకిల్ తొక్కితే 600 కేలరీల శక్తి బర్న్ అవుతుంది. అదే వాకింగ్ వల్ల 400 నుంచి 450 మాత్రం అవుతుంది. అంటే వాకింగ్ కంటే సైక్లింగ్ వల్లే ఎక్కువ లాభం అన్నమాట. సైకిల్ తొక్కడం వల్ల జాయింట్ల ప్రాబ్లమ్ వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి పౌష్టిక ఆహారం అవసరం. ఆరోగ్యానికి ఇది 50 శాతం ఉపయోగపడుతుంది. మైండ్ మీద ప్రభావం 25 శాతం ఉంటుంది. అంటే ఒత్తిడి, నెగెటివ్ థింకింగ్, మానసిక సంక్షోభం.. వీటి ప్రభావమన్నమాట. మిగిలిన 25 శాతం బాడీ మూవ్‌మెంట్స్‌ని బట్టే ఉంటుంది. ఇది సైక్లింగ్ ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను మాత్రమే కాదు. చాలా సర్వేల్లో కూడా ఇదే నిజమని తేలింది. అందుకే అర్బన్‌లో సైక్లింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది.
- మహర్షి, హెల్త్ ఎక్స్‌పర్ట్

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...