Skip to main content

గ్రాఫిక్ నావెల్స్


వందల సంవత్సరాల క్రితం...
హైదరాబాద్‌లోని పంజాగుట్ట అడవి ప్రాంతం..
అనగనగా ఒకరోజు.. సర్‌పెర్సీ అనే వేటగాడు వేటకు వెళ్తాడు. దగ్గరలోని నదిలో ఏదో కొట్టుకు వస్తున్నట్లు పెర్సీ గమనిస్తాడు. అది తీరానికి సమీపించాక తెలుస్తుంది.. అదో పెద్ద రాక్షసబల్లి అని. దాని నుంచి తప్పించుకునేందుకు పరుగు మొదపూడతాడు పెర్సీ. ఆ డైనోసార్ వెంట పడుతుంది. పరుగు తీస్తున్న పెర్సీకి ఒక ఆటో ఎదురౌతుంది.


‘త్వరగా పోనీయ్.. నన్ను ఇరవై ఒకటో శతాబ్దానికి తీసుకెళ్లూ..’ అంటూ పరుగున ఆటో ఎక్కాడు పెర్సీ.

‘ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా?’ అని బేరం మొదపూట్టాడు ఆ ఆటోవాలా.
పెర్సీకి ఆటోవాడి మీద కోపం కంటే డైనోసార్ మీద భయమే ఎక్కువ. అందుకే ఆటోవాడ్ని ‘జల్దీ.. జల్దీ..’ అని బలిమిలాడాడు. ఆటో కదిలింది.. ఇరవై ఒకటో శతాబ్దానికి. అదొక ‘టైమ్ మిషిన్’ ఆటో. దాని చక్రాల కదలికలో కాలగమం.. హైదరాబాద్ పరిణామ క్రమం.. కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇది విఠాలాచార్య సినిమాకాదు. స్పిల్‌బర్గ్ జూరాసిక్ పార్క్‌కు హైదరాబాద్ వెర్షన్ అంతకన్నా కాదు. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంగా వస్తున్న తొలి గ్రాఫిక్ నవలలోని మొదటి ఎపిసోడ్. ‘యుగంతర్’ సంస్థ ‘ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్’లో భాగంగా ‘హైదరాబాద్ గ్రాఫిక్ నవల’ని రూపొందిస్తోంది. దీనికోసం జయదీప్, జస్‌రామన్ అనే ఇద్దరు కుర్రాళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ నవలకు సంబంధించిన కొన్ని ఎపీసోడ్లు వారు పూర్తి చేశారు కూడా.

త్రీ యాపిల్స్ ఈ ప్రపంచ గమనాన్నే మార్చివేశాయి.
ఒకటి ఈవ్ తిన్న యాపిల్.
రెండు న్యూటన్ తలపై పడ్డ యాపిల్.
మూడు.. స్టీవ్ జాబ్స్ క్రియేట్ చేసిన యాపిల్.

5580 talangana patrika telangana culture telangana politics telangana cinema


అప్పుడూ ఇప్పుడూ ఎ ఫర్ యాపిలే. కాకపోతే ఈ జనరేషన్‌కి యాపిల్ కంటే యాపిల్ కంపెనీ గురించే ఎక్కువ తెలుసు. అందుకే స్టీవ్ జాబ్స్ జీవితం ఒక చదువుకోవాల్సిన పాఠం. అది గ్రహించే స్టీవ్ జీవితాన్ని గ్రాఫిక్స్‌లోకి మారుస్తున్నారు. ‘ద జెన్ ఆఫ్ స్టీవ్ జాబ్స్’ పేరుతో 0 పేజీల పుస్తకం ఫోర్బ్స్ రూపొందిస్తోంది. స్టీవ్ జీవితానికి అద్దం పట్టే సంఘటనలు, అతని ఆధ్యాత్మిక గురువు కొబున్ చీనోతో అనుబంధాన్ని ఇందులో క్రియేటివ్ ఆర్ట్స్‌తో వివరిస్తున్నారు. కొబున్ ఒక బుద్ధిస్ట్. 1970లో జపాన్ నుంచి అమెరికాకు వచ్చాడు. అప్పటి నుంచి స్టీవ్ జాబ్స్‌తో అనుబంధం ఏర్పడింది. 2011 వరకు వారి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ పుస్తకాన్ని అచ్చువేస్తున్నారు. ఇందులో నిజాలు, కల్పితాలు ఉంటాయి. దీనిలోని బొమ్మల్ని జెస్స్3 అనే క్రియేటివ్ ఏజెన్సీ డిజైన్ చేస్తోంది.

1950లోబెంగాల్‌కు చెందిన ఒక యువకుడు పరిశోధన మొదపూడతాడు. పాతతరం పహిల్మాన్ల ఆహారనియమాలు, శరీర ధృడత్వం మీద పీహెచ్‌డీ చేయాలనుకుంటాడు. అలాంటి సమయంలో అతనికి గమా పహిల్మాన్ గురించి తెలుస్తుంది. 12లో అమృత్‌సర్‌లో పుట్టిన గమా పహిల్మాన్ అసలు పేరు గులామ్ మహ్మద్ బక్స్. ప్రపంచం గర్వించదగ్గ రెజ్లర్‌గా ఎదుగుతాడు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తనతో రెజ్లింగ్ చేసి గెలవొచ్చని ప్రపంచానికి ఛాలెంజ్ విసిరిన మొనగాడు. కానీ జీవితం చివరి దశలో కేవలం 300 రూపాయల పెన్షన్‌తో బతుకుతాడు. తినడానికి తిండి లేక హీనమైన స్థితిలో మంచాన పడితే ప్రముఖ పారిక్షిశామికవేత్త 1200 రూపాయల చెక్ పంపుతాడు. అది చూసి గమా కన్నీళ్లు పెట్టుకుంటాడు. గమా 1960లో మరణించాడు. ఆయన జీవితం ఆధారంగా ప్రముఖ గ్రాఫిక్ నావెలిస్ట్ సర్‌నాథ్ బెనర్జీ ఇప్పుడొక గ్రాఫిక్ నావెల్ రాస్తున్నాడు. గమనమః (ద స్టోరీ ఆఫ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్) అనే పేరుతో రూపొందుతోంది ఈ పుస్తకం. సర్‌నాథ్ గతంలో హరప్పా ఫైల్స్, బార్న్ ఓల్స్ వండ్రస్ కేపర్స్, కారిడార్ లాంటి గ్రాఫిక్ నవలలు రాశాడు. కారిడార్ భారతదేశపు తొలి గ్రాఫిక్ నావెల్‌గా పేర్కొంటారు.

ఇవి ప్రస్తుతానికి ట్రెండ్ సృష్టిస్తున్న గ్రాఫిక్ నవలలు. ప్రపంచవ్యాప్తంగా గ్రాఫిక్ నవలలకు ఆదరణ పెరుగుతోంది. గడిచిన పద్దెనిమిది నెలల్లోనే ఊహించని రీతిలో పెరిగిందంటున్నారు నిపుణులు. అందుకే యుకెకి చెందిన హర్పర్ కోలిన్స్, మ్యాక్‌మిలాన్‌లాంటి పెద్ద పెద్ద పబ్లిషర్లు కూడా వీటిపై దృష్టి పెట్టారు. బుక్ స్టోర్స్ కూడా వీటికోసం ప్రత్యేక వార్డ్‌రోబ్‌లను ఓపెన్ చేస్తున్నాయి. టెక్ట్స్‌ని చదవడం బోర్ కొట్టేవారికి, విజువల్స్ హెల్ప్ చేస్తాయి. చదివేందుకు ఆసక్తి కలిగిస్తాయి. అందుకే వీటికి మార్కెట్ పెరుగుతోంది అని విశ్లేషిస్తున్నారు విమర్శకులు. హాలీవుడ్‌లో కామిక్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి కామిక్స్ ఎన్నో రూపొందాయి. ఎంజిలీనా జోలీ నటించిన వాంటెడ్ సినిమా కూడా తాజాగా గ్రాఫిక్ నవల రూపంలో వచ్చింది.

‘నేను రాసినదాన్ని గతంలో ఎవరైనా రాశారేమో’ అన్నాడొక రచయిత. నిజమే రాసి ఉండొచ్చు. కానీ రాసిన దాన్ని కూడా కొత్తగా రాసేందుకు.. గీసేందుకు గ్రాఫిక్ నవలలు ఉపయోగపడతాయి. అందుకే పాతతరం అందించిన గొప్ప సాహిత్యాన్ని ‘గ్రాఫిక్’ల రూపంలోకి మారిస్తే యంగ్ జనరేషన్‌కి రీడబుల్‌గా... చూడబుల్‌గా ఉంటుంది.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...