Skip to main content

అచల శిల్పాలు... అద్భుత రూపాలు




ఒక క్రియేటివ్ థాట్..
ఏడుగురు శిల్పులు..
12 ప్రాంతాలు..
20 రోజులు..
3800 కిలో మీటర్లు...
శిల్పాల కోసం ఒక సాహస యాత్ర...
కర్టసీ.. అచల స్టూడియో..
కన్సెప్ట్.. శివరామాచారి..
కదిలే శిల్పాల మిక్స్ అండ్ మ్యాచ్ కథ ఇది.. 

అచల అంటే స్థిరమైనది అని అర్ధం. కానీ ఈ శిల్పాలు స్థిరంగా ఒకే ప్రాంతంలో ఉన్నవి కాదు.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదిలిన శిల్పాలు. ఒక ప్రాంతం ప్రత్యేకతలు.. పరిసరాలు.. పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన అద్భుతాలు. భైరవకోన ప్రకృతి సౌరభాలు.. బెంగళూరు అర్బన్ టచ్... బేలూర్ చెన్నకేశవ ఆలయ అందాలు.. సహ్యాద్రి పర్వత సౌందర్యాలు.. మైసూర్ మిత్స్... ఊటీ నేచర్... కన్యాకుమారి కమనీయ దృశ్యాల నుంచి శిల్పులు స్ఫూర్తి పొంది తీర్చిదిద్దిన శిల్పాలివి. మే 12న హైదరాబాద్‌లో బయలు దేరిన అచల స్టూడియో టీమ్ భైరవ కోన నుంచి ఒక యాత్రని ప్రారంభించింది. బేలూర్, వెస్ట్రన్ ఘాట్స్, మైసూర్, ఊటీ, కొచ్చీ, కన్యాకుమారి, పొదుచెర్రీ, మహాబలిపురం, చెన్నై మీదుగా సాగిన ఈ యాత్ర జూన్ 1న తిరిగి హైదరాబాద్‌కి చేరుకుంది. ఆరుగులు శిల్పులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ ఇన్‌స్పైర్ అయిన అంశాల్ని తమ శిల్పాలకు జోడిస్తూ.. 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి 20 రోజుల తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 2న తాము చెక్కిన శిల్పాలను బంజారాహిల్స్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. 

తొలి ప్రయత్నం
ఒక రచయిత మంచి కథ రాయాలంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటాడు. ప్రకృతి నుంచి, పరిసరాల నుంచి, పరిస్థితుల నుంచి, రకరకాల సంఘటనల నుంచి స్ఫూరి పొంది రాస్తాడు. అలాగే కళాకారులు కూడా. శిల్ప కళకు సంబంధించి రకరకాల వర్క్‌షాప్‌లు, ఎగ్జిబిషన్లు జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ శిల్పాలని చెక్కాలన్న ఆలోచన మాత్రం కొత్తది. ఇదే ప్రథమం కూడా. అచల స్టూడియో నిర్వహించిన యాత్ర వెనక క్రియేటివ్ మైండ్ మాత్రం శిల్పి శివరామాచారిది. ఆయన 2002లో అచల స్టూడియో ప్రారంభించి ఎన్నో అధునాతన శిల్పాలను రూపొందించారు. పార్క్ హయత్‌లాంటి పెద్ద పెద్ద హోటళ్లలో ఆయన శిల్పాలిప్పుడు కొలువుతీరి ఉన్నాయి. ఈ యాత్ర గురించి తెలుసుకునే ముందు శివరామాచారి గురించి కూడా కొంత తెలుసుకోవాలి. 


వారసత్వమే కానీ.. 
shiశివారామాచారిది మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి. ఆయన తండ్రి జగదీశ్వరాచారి శిల్పాలు చెక్కేవారు. ఆయన ఎక్కువగా సంప్రదాయబద్ధమైన శిల్పాలు, దేవతా విగ్రహాలు తయారు చేసేవారు. వాటికి కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. నిర్ణీత కొలతలుంటాయి. శివరామాచారి చిన్నప్పటి నుంచి శిల్పాలు ఎలా చెక్కాలో తండ్రి నుంచి నేర్చుకున్నాడు. కానీ ఆయన అదే వారసత్వాన్ని కొనసాగించాలని అనుకోలేదు. అందులోనే స్థిరపడినా తనకంటూ ఓ కొత్తదారిని కోరుకున్నారు. అందుకే తండ్రి సలహా మేరకు అదే చదువు చదివాడు. 1997లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు. కాలేజ్‌లో చెప్పని పాఠాలు కూడా శివరామాచారికి తెలుసు. ఎందుకంటే ఇత్తడితో కూడా విగ్రహాలు చేసిన అనుభవం అతనికి ఉంది. అందుకే చదువులో బాగా రాణించాడు. 2002లో చదువు పూర్తయిన తర్వాత ‘అచల’ పేరుతో చిన్న స్టూడియో పెట్టుకుని రకరకాల శిల్పాలు చెక్కుతుండేవాడు. ఫైబర్ గ్లాస్, ఇత్తడి, స్టీల్, ఐరన్‌లాంటి రకరకాల మెటీరియల్స్‌తో ఎన్నో ప్రయోగాలు చేశాడు.

అధ్యాపకుడిగా.. 
మోడ్రన్ ఆర్ట్‌లో మరింత ముందడుగు వేసేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శిల్ప కళలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు శివరామాచారి. ఆ చదువు పూర్తయిన తర్వాత అతనికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే శిల్పకళా అధ్యాపకుడిగా అవకాశం లభించింది. కొంత కాలం అక్కడ పనిచేసిన తర్వాత 2007లో న్యూఢిల్లీలోని ఇండియన్ హబిటాట్ సెంటర్‌లో తన శిల్పాల్ని ప్రదర్శించాడు. వాటికి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత స్థానికంగా చాలా ప్రదర్శనలిచ్చాడు. దేశవ్యాప్తంగా 25కు పైగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాడు. దీంతో శివరామాచారికి ఒక నేమ్.. ఫేమ్ లభించింది. శివరామాచారి శిల్పాలు ఎక్కువగా ప్రయోగాత్మకంగా ఉంటాయి. క్రియేటివ్‌గా ఉంటాయి. ఆయన ఇప్పటి వరకు 150కిపైగా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. పార్క్ హయాత్ ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేసి ఫ్లవరింగ్ బ్యూటీ శిల్పం ఆయన తయారు చేసిందే. మొత్తం స్టీలుతో తయారు చేసిన ఆ శిల్పం.. కమలం పువ్వుపై మగువ ఉన్నట్లు అందంగా కనిపిస్తుంది. సింగిల్ మెటల్‌తో అంతటి అందం తీసుకురావడం ఆయన స్టైల్. సైకిల్ విడిభాగాలతో చేసిన ఎఫ్ టీవీ ర్యాంప్, ఆక్రిలిక్‌తో చేసిన 21 ఫస్ట్ సెంచరీ కృష్ణ.. ఇలా ఒక్కో శిల్పం వెనక ఒక కథ ఉంటుంది. 

యాత్ర గురించి... 
మొబైల్ స్కల్ప్‌చర్ పేరుతో యాత్ర చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని శివరామాచారిని అడిగితే ఇలా చెప్పారు - ‘కళాకారులు సాధారణంగా కొత్త ప్రాంతాలని, గ్యాలరీలని ఎందుకు సందర్శిస్తుంటారో తెలుసా? ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ కోసం. నేను కూడా ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదిస్తుంటాను. అందుకే నా శిల్పాల్లో ఎక్కువగా నేచర్ అండ్ నాచురాలిటీ కనిపిస్తుంటుంది. అలా కొత్త ప్రాంతాలను సందర్శించిన స్ఫూర్తి పొందాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. దాని నుంచి నాకు ఈ మొబైల్ స్కల్ప్‌చర్ స్టూడియో ఐడియా వచ్చింది. ఈ ఐడియా రెండేళ్ల క్రితమే వచ్చినప్పటికీ దాన్ని ఆచరణలో పెట్టి సాధ్యం చేసేవరకు ఇంత సమయం పట్టింది. మేం కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడి (హైదరాబాద్) నుంచి బయలు దేరి మొదట బైరవకొండకు చేరుకున్నాం. అక్కడి నుంచి మా యాత్ర ప్రారంభమైంది. మేం ఎంచుకున్న ప్రాంతాలన్నీ శిల్ప కళకు దగ్గరి సంబంధం ఉన్నవి. ప్రతిచోటా మాకు మంచి స్పందన లభించింది. మొదట మేం మనదేశమంతా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరగాలనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే మొదటి విడతలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని ఎంచుకున్నాం. సక్సెస్ అయింది. సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో ఇండియా అంతా తిరగాలన్నది అచల స్టూడియో లక్ష్యం’.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...