Skip to main content

రోటీ, కపడా ఔర్ మొబైల్


‘నిన్న చెప్పా పెట్టకుండా పని మానేశావేంటే?’ పనమ్మాయిపై కోప్పడింది యజమానురాలు. 
‘అదేందమ్మ గారు! జర ఒంట్లో సుస్తిగుంది. ఇయాళ రాలేనని మెసేజ్ బెట్టినగద. సూస్కో లేదా?’ సమాధానమిచ్చింది పనమ్మాయి. 
---
సెల్ ఒకప్పుడు కేవలం స్టే
టస్ సింబల్.
కానీ ఇప్పుడు.. నిత్యావసరం. హస్త భూషణం.
పుట్టిన తర్వాత వచ్చి చేరే అవయవం. ఒక ఆర్టిఫిషియల్ ఆర్గాన్.
కళ్లు లేని కబోధిలా... కాళ్లు లేని అభాగ్యుల్లా... సెల్ లేని వారు ఇప్పుడు అవిటివారు..
అందుకే ఇప్పుడు తాగడానికి నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్ దొరుకుతోంది.
పదేళ్ల క్రితం ఒక నిముషం మాట్లాడాలంటే రూ. 32.80 బిల్లు పడేది. ఇప్పుడు ఒక పైసాతో నిముషం మాట్లాడొచ్చు. సిమ్‌కార్డ్ ఫ్రీ.. డబుల్ టాక్‌టైమ్...లాంటి బంపర్ ఆఫర్లు.
2011 అంతానికి మన దేశంలో 81.15 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇంత వేగంగా ప్రజలకు చేరువైన సౌకర్యం మరొకటి లేదు.
దేశంలోని మొత్తం మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అందుకే 1జీ పోయింది. 2జీ స్కామ్‌లో ఉంది. 3జీ ఫామ్‌లో ఉంది. 4జీ రానుంది.
చైనా తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే మన మొబైల్ మార్కెట్ అతి పెద్దది. అతి వేగవంతమైంది.
వాహ్... భారత్ వెలిగిపోతోంది.
హర్ హాథ్ మే ఏక్ మొబైల్!
ప్రతి పేద చేతిలోనూ ఓ సెల్‌ఫోన్ వెలిగిపోతోంది...
ఆ వెలుగు వారి జీవితంలో కొత్తద్వారాలు తెరుస్తోంది... అనుకోని ఆ వెలుగుతో వాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు.
ఆ ఆశ్చర్యంలో గంజి గొంతులోకి జారలేదు. కడుపు ఖాళీగా ఉంది.
అయినా ‘కడుపు నిండా’ మాట్లాడుకుంటున్నారు.
అందమైన కల!?
సెల్‌ఫోన్ రింగయింది. కల చెదిరింది. ఇదంతా కలా?
అవును... కలే. యూపీఏ సర్కారు కన్న కల.
రూపాయికి కిలో బియ్యం.. పావలా వడ్డీకి రుణాల్లా.. పేదలకి ఉచితంగా మొబైల్ ఫోన్ల పంపిణీ పథకం.
60 లక్షలకు పైగా ఉన్న నిరుపేదలకు 7 వేల కోట్ల రూపాయలు వెచ్చించి సెల్‌ఫోన్లు కొనిపెట్టాలన్న ఆలోచనలో ఉందట.
సూపర్!
నెల నెలా 200 నిమిషాల ఫ్రీ టాక్‌టైమ్ కూడా ‘రేషన్’ ఇస్తుందట.
కెవ్వు కేక!!
2014 ఎన్నికల్ని ఎదుర్కొనేందుకిదేదో ప్రజాకర్షణ్ పథకంలా ఉంది.
అవును.. అయితేంటి?
ఐస్‌ముక్కలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు కరిగిపోకుండా.. నిజంగా ఈ పథకం పేదల చేతికి చేరిందనుకుందాం. దేశంలో దాదాపు మూడోవంతు మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు.
ఉన్నా పన్నెండు.. పదిహేను గంటలు.. కోసేస్తోందీ ప్రభుత్వం.
మరి పేదలు ఈ ఫోన్లకు ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి?
అందుకే మీరు రీఛార్జ్ కావాలి.
ఓటు మీ ఆయుధం.
ఈ చీప్ పాలిటిక్స్‌ని ఎదుర్కొనేందుకు రెడీ అవ్వాలి.
(august 26, 2012)

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...