Skip to main content

జస్ట్.. ఒక్క నిమిషంలో ఏం జరుగుతోంది?


కంప్యూటర్ ఆన్‌లో ఉంది. 
అది ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయి ఉంది. 
ఒక ఈ-మెయిల్ పంపించడానికి ఎంత సమయం పడుతుంది? 
జస్ట్.. ఒక్క నిమిషం!
ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేయడానికి.. ట్విట్టర్‌లో ట్వీట్ కొట్టడానికి???
అంతే సమయం.. అదే నిమిషం.. 
అంటే.. కేవలం 60 క్షణాలు...
ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది?
లెక్కల మాస్టారు పాఠం చెప్పినట్లు అంకెలు కాస్త ఎక్కువగా ఉంటాయి, కంగారు పడకండి.

ప్రస్తుతం..
ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారు. అందులో ఆసియాకి చెందినవారు 44.8 శాతం మంది ఉన్నారు. సుమారు సగం వాడకందారులు మన ఖండంలోనే ఉన్నారన్నమాట. ఇందులో చైనా వాటా 50 శాతం. 12 శాతంతో మన దేశం రెండో స్థానంలో ఉంది. అంటే భారతదేశ జనాభాలో 10 శాతం మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారన్నమాట.

‘వెబ్’ దునియా: ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల వెబ్‌సైట్లు ఉన్నాయి. 2011లోనే 30 కోట్ల వెబ్‌సైట్లు కొత్తగా చేరాయి. ప్రతి ఒక్క నిమిషంలో 570 కొత్త వెబ్‌సైట్‌లు రిజిస్టర్ అవుతున్నాయి.
‘సోషల్’యిజం: ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్క నిమిషానికి 6,95,000 స్టేటస్‌లు అప్‌డేట్ అవుతున్నాయి. 2,77,000 మంది బుక్(లాగిన్) అవుతున్నారు. 79,364 మంది వాల్స్ పోస్ట్ చేస్తున్నారు. 6,47,22 లైకులు కొడుతున్నారు, 5,10,040 మంది కామెంట్స్ రాస్తున్నారు. ట్విట్టర్‌లో 320కిపైగా కొత్త అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. 98 వేల మంది ట్వీట్‌లు పోస్ట్ చేస్తున్నారు.
‘బ్లాగో’తం: 60 సెకన్లకు 60 బ్లాగులు కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. 1500 మంది ఆ బ్లాగుల్లో పోస్ట్‌లు రాస్తున్నారు. 20,000 కొత్త పోస్టులు టుంబ్లర్ (tumbler)లోకి అప్‌లోడ్ అవుతున్నాయి. 125కి పైగా వర్డ్‌వూపెస్ ప్లగిన్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

2020లో...
రానున్న ఎనిమిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్య 600 కోట్లకు చేరుకోనుంది. మొబైల్ ఫోన్లలో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంటర్‌నెట్ వాడే వారి సంఖ్య 2014 నాటికి 250 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి ప్రతి 60 సెకన్లకు 217 మంది కొత్తగా వాడకం మొదలుపెడుతున్నారు. అంటే 2020 నాటికి ఈ సంఖ్య 318 కోట్లకు చేరుకోనుంది. మొత్తంగా ఇంటర్‌నెట్ వాడే వారితో పోలిస్తే మొబైల్ ఫోన్లలో ఇంటర్‌నెట్ వాడేవారే సంఖ్య సగానికి ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ప్రతి సెకనుకు 10,663 జీబీల సమాచారం కొత్తగా ఇంటర్‌నెట్‌లో చేరుతోంది. ఇది ఎగ్జా బైట్ల నుంచి జిటా బైట్లకు చేరనుంది. అంటే, 2020లో సమస్త సమాచారం మొత్తం మీ చేతిలో ఉంటుందన్నమాట.
మంచి వెన్నంటే చెడూ, వెలుగు వెనకాల చీకటి ఉన్నట్లు... ఇంటర్‌నెట్‌లో ఇన్ఫర్మేషన్‌తోపాటు వైరస్సూ ఉంటుంది. హ్యాకర్లూ కాచుకుని ఉంటారు. ప్రస్తుతానికి ఒక నిమిషంలో 232 కంప్యూటర్లకు వైరస్ వస్తోంది. 12 వెబ్‌సైట్లు హ్యాక్ అవుతున్నాయి. 416 సైట్ల హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020లో ఇంటర్‌నెట్ మీద హ్యాకర్ల దాడి మరింత పెరగనుంది.

ప్రస్తుతం.. ప్రతి 60 క్షణాలకు...
- 20.4 కోట్ల ఈ-మెయిల్స్ పంపుతున్నారు.
- గూగుల్‌లో వెతికేవారి సంఖ్య 20 లక్షలు.
- యూట్యూబ్‌లో 13 లక్షల వీడియోలు చూస్తున్నారు. ఇదే సమయంలో 48 గంటల వీడియో అప్‌లోడ్ అవుతోంది.
- స్కైప్‌లో 3,70,000 నిమిషాలకు పైగా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు.
-ఫ్లిక్కర్‌లో 3,125 కొత్త ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయి.
- అమేజాన్‌లో 83 వేల డాలర్ల విలువైన వస్తువులు అమ్ముడు పోతున్నాయి.
- మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ పీసీలలో 47, 000 యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
- వికీపీడియాలో ఆరు కొత్త వ్యాసాలు పబ్లిష్ అవుతున్నాయి.
- 13,000 గంటల మ్యూజిక్ స్ట్రీమింగ్ అవుతోంది.
-మొత్తంగా 639,800 జీబీల సమాచార మార్పిడి జరుగుతోంది.

(september 2, 2012)

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...