Skip to main content

Posts

Showing posts from December, 2014

హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే ఉన్నాయి..

హైదరాబాద్ నూర్జహాన్ ఈ చరిత్ర పునాదులు తవ్వుకుంటూ పోతే... పునాదుల కింద సమాధులు.. సమాధుల కింద ఎన్నో సత్యాలు. ముచ్‌కుందా నది అలాంటి ఓ సత్యాన్నే చెబుతోంది. ఒక నది రెండు తీరాలను విడదీయదు. రెండు ఒడ్డులను కలుపుతుంది. అలాంటి కలయికకు ప్రత్యక్షసాక్షి ముచ్‌కుందా. వరదకు ఎదురీదిన ఖులీ, భాగమతిల ప్రేమ నగరం.. ఈ భాగ్యనగరం.ఆ దంపతుల గారాల కూతురుదే ఈ సమాధి. కుతుబ్ షాహీ సమాధులలో హయాత్ బక్షీ బేగం సమాధి ప్రత్యేకమైనది. ఆమె ఎన్నడూ స్వయంగా పాలించలేదు. కానీ కుతుబ్ షాహీలలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉన్నది. హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే మన కళ్లకు కనిపిస్తున్నాయి. గగనంలో చుక్కలు.. తోటలోని పూవులు.. కలహించక కలిసుండును.. మనుషులేల కలహించుట.. అన్న దాశరథి మాటలు గుర్తుకువస్తున్నాయి ఈ సమాధిని చూస్తే. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ హైదరాబాద్ నూర్జహాన్ కథ వినాల్సిందే.  సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా చనిపోంగనే ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్‌షా పన్నెండు సంవత్సరాల వయస్సులనే సింహాసనం అధిష్టించినాడు. ఇతను కుతుబ్‌షాహీ వంశ పరిపాలకులల్ల ఐదో రాజు. చిన్న వయస్సు వల్ల అతను కేవలం నామ్ కే వస్తే నవాబుగా ఉన్నడు. తల్లి ...

ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యాన్ని పాలించిన ఓ వీర వనిత గాథ

స్వాతంత్య్రానికి పూర్వం దేశాన్ని తెల్లదొరలు, రాష్ర్టాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం కష్టాలు పడుతుంటే.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జల్.. జంగల్.. జమీన్.. అంటూ గర్జించాడు మన గోండు వీరుడు కొమురం భీమ్.  అది ఒక స్వేచ్ఛా పోరాటం. ఈ సువిశాల భారతదేశంలో ఆదివాసులది మొదటి నుంచీ ఇలాంటి పోరాటమే. ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యాన్ని పాలించిన ఓ వీర వనిత గురించి ఎప్పుడైనా విన్నారా? మొఘలుల సామ్రాజ్యం ఉత్తర భారతం మొత్తం విస్తరించినా, దక్షిణ భారతంలో విస్తరించకుండా పోరాడిన యోధులు గోండులు. ఆదిలాబాద్ అడవులు మొదలుకుని..  దక్షిణ భారతదేశం సరిహద్దు భూభాగంలో మధ్య భారతపు అతి పెద్ద వన సామ్రాజ్యం గోండ్వానా. 450 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ గోండ్వానాను ఆక్రమించడానికి యత్నిస్తే  ఎదురొడ్డి పోరాడింది రాణీ దుర్గావతి. శత్రువు చేతికి చిక్కి బానిసగా బతికేకంటే.. విజయావకాశాలు లేనప్పుడు ఆత్మత్యాగం చేసుకుని గోండ్వానా శౌర్యాన్ని, ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన ధీర వనిత మహారాణి దుర్గావతి ఈ వారం మన ...

ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత

కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి... శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి అరుదైన పాలనా దక్షురాలు.. అసమాన పరాక్రమశాలి.. శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ మహారాజు.. అలియాస్ రుద్రమ దేవి.. ఉరఫ్.. రుద్రాంబ. రాణీ రుద్రమ దేవి.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ నేమ్ ఒక ఫైర్ బ్రాండ్. దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితమే సమాజంలో బలంగా వేళ్లూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరిన వీరనారి. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా?  అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ఒక ప్రతీక. స్త్రీ ఆత్మ గౌరవానికి సమున్నత పతాక. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గ ధారిణి...  రాణీ రుద్రమదేవి గురించి మనకు తెలిసింది ఎంత?  రాణీ రుద్రమ దేవి గురించి మనకు తెలిసినదానికన్నా తెలియనిదే ఎక్కువ. ఆమె జన్మ సంవత్సరం తెలియదు. ఉజ్జాయింపుగా ఊహించడానికి వీలుంది అని కాకతీయ యుగము గ్రంథంలో లక్ష్మీరంజనం రాశారు. నిజమే! రుద్రమదేవి గురించి చరిత్రకారులకూ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ఏడో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఇలా ఉంది. మీరు ఎప్పుడైనా అత్...