ఈ రొయ్యల వెరైటీలను మనమూ రుచి చూస్తే.. ఆ మజాయే వేరప్పా.!
అరిటాకు రొయ్యలు
కావాల్సినవి :
రొయ్యలు : 200 గ్రా, కారం : ఒక టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, అరటి ఆకు : ఒకటి, కొత్తిమీర : ఒక కట్ట, పుదీనా : ఒక కట్ట, నూనె, ఉప్పు : తగినంత
తయారీ :
ముందుగా రొయ్యలను బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని అరిటాకులో చుట్టి నిప్పుల మీద కాల్చాలి. బాగా కాలిన తర్వాత ఆకు నుంచి తీయాల్సి ఉంటుంది. వీలైతే మరో అరిటాకు తీసుకొని ఈ కూరను అందులో పెట్టి సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది.
చిట్టి ముత్యాల రొయ్యల పలావ్
కావాల్సినవి :
రొయ్యలు : 200 గ్రా., బియ్యం : 250 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, గరం మసాలా : పావు టీస్పూన్, మిరపకాయలు : 2 టీస్పూన్స్, కొత్తిమీర : అర కట్ట, పుదీనా : అర కట్ట, ఉల్లిపాయ : 1, నెయ్యి : 2 టీస్పూన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్స్, నూనె : 2 టీస్పూన్స్,ఉప్పు : తగినంతతయారీ :
ముందుగా రైస్ నానబెట్టాలి, ఆ తర్వాత రొయ్యలు కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, రొయ్యలు వేయాలి. ఇవి వేగిన తర్వాత బియ్యం వేసి సరిపడా నీళ్లు పోయాలి. సన్నని మంట మీద అన్నం ఉడికే వరకు అలాగే ఉంచాలి. చివరగా నెయ్యి వేసి పదిహేను నిమిషాల పాటు దమ్ మీద అన్నాన్ని ఉడికించాలి. సూపర్ పులావ్ నోరూరిస్తుంది. దీన్ని రైతాతో తింటే కూడా చాలా బాగుంటుంది.రొయ్యల బూందీ
కావాల్సినవి :
రొయ్యలు : 200 గ్రా., కార్న్ఫ్లోర్ : 50 గ్రా., మైదా : 50 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, మిరపకాయలు : 50 గ్రా., వెల్లుల్లి : 50గ్రా, అల్లం : 50 గ్రా. కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు, నూనె : తగినంతతయారీ :
రొయ్యలను కడిగి పెట్టుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఈ రొయ్యలను డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి. మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇవి వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, చివరగా వేయించుకున్న రొయ్యలను వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి..వేడి రొయ్యల బూందీ రెడీ!చింతచిగురు ఎర్ర రొయ్యలు
కావాల్సినవి :
రొయ్యలు : 200 గ్రా., చింతచిగురు : 50 గ్రా. శనగపప్పు : 100 గ్రా.,కారం : ఒక టీస్పూన్
పసుపు : అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్,
గరం మసాలా : అర టీస్పూన్,
కరివేపాకు : 2 రెమ్మలు,
పచ్చిమిర్చి : 2ఉల్లిపాయలు : 2,
కొత్తిమీర : ఒక కట్ట ఉప్పు, నూనె : తగినంత
0 comments:
Post a Comment